Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరితహారం చెట్లు నరికినందుకు రూ.45వేలు ఫైన్

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (13:24 IST)
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. కేవలం మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే కాదు.. వాటి సంరక్షణ బాధ్యతలను కూడా అధికారులకు అప్పగించింది. కొన్ని చోట్ల ఆ మొక్కలు పెరిగి చెట్లయ్యాయి. అయితే, కొందరు వ్యక్తులు ఆ చెట్లను నరుకుతున్నారు.
 
సిద్దిపేట పట్టణంలోని శివమ్స్ గార్డెన్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ నిర్వాహకులు హరితహారం చెట్లను నరికారు. తమ హోర్డింగ్ కనిపించడం కోసం ఫుట్ పాత్‌పై ఉన్న చెట్ల కొమ్మలను కొట్టేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చెట్లను నరికేసిన వ్యక్తులను గుర్తించిన అధికారులు జరిమానా విధించారు. 
 
మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారికి ఆర్టికల్చర్ అధికారి ఐలయ్య రూ.45,000 జరిమానా విధించారు పట్టణంలోని మొక్కలకు ఎవరు హాని కలిగించిన వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం