Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావనైనా చస్తాం.. ఏపీలో పనిచేయం... నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల ఆమరణ దీక్ష

Webdunia
సోమవారం, 30 మే 2016 (09:38 IST)
చావనైనా చస్తాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేసే ప్రసక్తే లేదని తెలంగాణ ఉద్యోగులు హెచ్చరించారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు తీవ్రరూపం దాల్చాయి. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించినా ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి అమరణ నిరాహార దీక్షలకు దిగుతున్నారు. ఈ ఆమరణ నిరాహారదీక్షలను ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. 
 
ఏపీ విద్యుత్ సంస్థల్లో మూడు వందల పైచిలుకు మంది తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏడాది కాలానికి అక్కడ పనిచేయడానికి వెళ్లిన ఉద్యోగులను ఏపీ విద్యుత్ అధికారులు రిలీవ్ చేయడంలేదు. దీంతో కొంతకాలంగా వారు ఆందోళన చేస్తున్నారు. శనివారం కొంత మంది ఉద్యోగులు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ వద్దకు వెళ్లి తమను వెంటనే రిలీవ్ చేయాలని పట్టుబట్టారు. దాంతో ఆయన తనకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరారు. సోమవారం ఉదయం 10.30 గంటల వరకు రిలీవ్ చేసే అవకాశం లేనందున నిరాహార దీక్షకు సిద్ధమమవుతున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments