అరాచకాలకు నిలయమైన ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం జరిగిపోయింది. 15 ఏళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి, చెట్టుకు ఉరివేసి చంపేశారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే గ్రామ సరిహద్దులో తన కూతురు చెట్టుకు ఊరివేసుకుని కనిపించడంతో బాలిక తండ్రి గుండెలు బద్దలు కొట్టుకున్నాడు. విషయం తెలియడంతో బాలిక బంధువులు, గ్రామస్థులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. బాలిక తండ్రి గత శుక్రవారమే తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోని నలుగురు కానిస్టేబుళ్ళను అధికారులు విధులనుంచి తొలగించారు. పోలీసులు విచారణంలో మాత్రం సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు ఊరి తీసినట్లు తేలింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఇమ్రాన్, సర్వ్జిత్ యాదవ్, ఘన్శ్యామ్ మౌర్యాలే తన కూతురిని హత్యచేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఇంతకుముందే తన కుమార్తెను అపహరించేందుకు ప్రయత్నం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు సర్వజీత్, ఇమ్రాన్లను అరెస్టు చేశారు. ఘనశ్యామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.