Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో బయటకొస్తే బుక్కయినట్టే.. పోలీసుల ఉక్కుపాదం

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (09:13 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్నవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిపై ఐపీసీలోని 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో నిందితులకు రెండేళ్ళ వరకు జైలుశిక్ష పడే అవకాశాలు లేకపోలేదు. 
 
ముఖ్యంగా, రాజధాని హైదరాబాద్, హైటెక్ సిటీ సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఈ తరహా కఠన చర్యలకు ఉపక్రమించారు. ఒక్క మంగళవారమే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏకంగా 150 మందిపై కేసులు నమోదుచేయడంతోపాటు 244 వాహనాలను సీజ్‌చేశారు. 
 
అలాగే, కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై బారికేడ్లు ఏర్పాటుచేసి పహారా కాస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి కర్ఫ్యూ ఉన్నందున ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చేవారికి నమస్కరించి మరీ లోపలికి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వినకపోతే లాఠీలకు పనిచెప్తున్నారు. వైద్య సిబ్బంది, మీడియాపై కొన్నిచోట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో పోలీసులకు ఉన్నతాధికారులు క్లాస్ పీకారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments