Webdunia - Bharat's app for daily news and videos

Install App

సభ్యత ముఖ్యం.. ఏపీ సీఎంని బూతులు తిట్టడం సరికాదు.. కేటీఆర్ ఫైర్

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (10:12 IST)
da  ఏపీ ‘బూతు’ రాజకీయాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిట్టడం సరైన పద్ధతి కాదని అభిప్రాయడ్డారు. రాజకీయాల్లో అన్నిటికంటే సభ్యత ముఖ్యమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏపీలో టీడీపీ ఆఫీసుల మీద దాడులు ఎవరు చేశారన్నది పక్కనబెడితే.. దానికి మూలం ఎక్కడుందన్నది ఆలోచించుకోవాలన్నారు. రాజకీయాల్లో అసహనం పనికిరాదన్నారు. 
 
రాజకీయాల్లో డిగ్నిటీ ఉండాలని, ఉద్యమ సమయంలో ఉద్వేగంతో మాట్లాడితే అర్ధం చేసుకోవచ్చు గానీ.. ఇప్పుడు బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. తెలంగాణలో కూడా కొందరు నేతలు సీఎం కేసీఆర్‌ని అనరాని మాటలు అంటున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
 
అధికారం అనేది ప్రజలు ఇస్తే వచ్చేదని, ప్రజల మనసు గెలుచుకుంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తదితర అంశాలపై శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. ప్రజలు టీఆర్ఎస్‌ని 2009లో తిరస్కరిస్తే పోరాటం చేసి 2014లో అధికారంలోకి వచ్చామని కేటీఆర్ అన్నారు. 2019లో ఏపీలో టీడీపీ అధికారం కోల్పోగా.. తెలంగాణలో అంతర్ధానమైందని ఎద్దేవా చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments