నాడు ఏడు అడుగులు కలిసి నడిచింది.. ఇపుడు మరణంలోనూ కలిసివెళ్లింది...

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (10:39 IST)
భర్తతో ఏడడుగులు నడిచి జీవితాంతం ఒకరికొకరు తోడూనీడలా ఉంటామని పెద్దల సాక్షిగా ఏర్పడిన భార్యాభర్తల బంధం చివరకు చావులో కూడా విడిపోమంటూ భర్తతో పాటు భార్య కూడా తనువు చాలించింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగారం గ్రామానికి చెందిన రైతు బండారు శ్రీనివాస్ రెడ్డి కుటుంబకలహాలతో క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఇకలేడనే విషయాన్ని జీర్ణించుకోలేని భార్య... అపర్ణ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు హుటాహుటిన అపర్ణ(26)ను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. 
 
క్షణికావేశంలో భర్త శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం, భర్త మృతిని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సింగారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు చనిపోవడం గ్రామంలోని ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments