Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలను ఇబ్బంది పెట్టడం సబబు కాదు.. సమ్మె విరమించండి.. హైకోర్టు

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (18:08 IST)
ప్రజలను ఇబ్బంది పెట్టడం సబబు కాదని, తక్షణం సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఆ రాష్ట్ర హైకోర్టు సూచన చేసింది. తక్షణం సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచన చేసింది. 
 
ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సమ్మె విరమించాలని ఆదేశించింది. పండుగలు, పాఠశాలల సమయంలో సమ్మె చేయడం ఎంతవరకు సమంజసం అని హైకోర్టు ప్రశ్నించింది. నిరసనలకు అనేక పద్దతులు ఉన్నాయి కదా అని యూనియన్లను నిలదీసింది. న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చా? చట్టాన్ని ఉల్లంఘించవచ్చా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే.. ఎస్మా చట్టాన్ని ఎందుకు ప్రయోగించకూడదో చెప్పాలని ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రశ్నించింది. 
 
సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటిస్తే పరిస్థితేంటని అడిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యంకాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆర్టీసీని విలీనం చేస్తే మిగతా కార్పోరేషన్లు కూడా డిమాండ్ చేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. అదేసమయంలో ప్రస్తుతం 75 శాతం బస్సులు నడుస్తున్నాయని, ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం తెలిపింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన హైకోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments