Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు సంపద సృష్టిస్తున్నాం... ప్రజలకు పంచుతాం : భట్టి విక్రమార్క

ఠాగూర్
ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (17:12 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించే పనిలో నిమగ్నమైవుందని, ఆ సంపదను ప్రజలకు పంచుతామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
 
'పదేళ్ల పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎంతో పోరాడారు. భారాస ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడలేదు' ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే హామీలు అమలు ప్రారంభించామని తెలిపారు. 'మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం. ఒకే విడతలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించాం. ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నాం.. మళ్లీ ప్రజలకు పంచుతున్నాం' అని వివరించారు.
 
'సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది. వెనుకబడిన కులాలకు కాంగ్రెస్‌ ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. కార్యకర్తల శ్రమ, త్యాగం వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కష్టపడి పనిచేసిన వారిని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని మరోసారి రుజువైంది. 2029లో రాహుల్‌ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు' అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments