Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు సంపద సృష్టిస్తున్నాం... ప్రజలకు పంచుతాం : భట్టి విక్రమార్క

ఠాగూర్
ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (17:12 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించే పనిలో నిమగ్నమైవుందని, ఆ సంపదను ప్రజలకు పంచుతామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
 
'పదేళ్ల పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎంతో పోరాడారు. భారాస ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడలేదు' ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే హామీలు అమలు ప్రారంభించామని తెలిపారు. 'మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం. ఒకే విడతలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించాం. ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నాం.. మళ్లీ ప్రజలకు పంచుతున్నాం' అని వివరించారు.
 
'సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది. వెనుకబడిన కులాలకు కాంగ్రెస్‌ ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. కార్యకర్తల శ్రమ, త్యాగం వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కష్టపడి పనిచేసిన వారిని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని మరోసారి రుజువైంది. 2029లో రాహుల్‌ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు' అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments