Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగొచ్చి చిత్ర హింసలు.. భరించలేక కొడుకును సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (10:20 IST)
పీకల వరకు మద్యం సేవించి వచ్చి చిత్ర హింసలు పెడుతున్న కన్న కొడుకుని ఆ తల్లిదండ్రులు సజీహదహనం చేశారు. నిత్యం ఇంట్లోనే నరకం చూపిస్తుండటంతో కడుపు తీపిని చంపుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల అనే దంపతుల కుమారుడు కడాలి మహేష్ చంద్ర (42). ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, మద్యానికి బానిసైన చంద్ర నిత్యం పెట్టే వేధింపులు భరించలేక రెండు నెలల క్రితమే భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయంది.
 
ఈ క్రమంలో మహేష్ చంద్ర ఇంట్లోనే ఉన్న తల్లిదండ్రులను వేధించసాగాడు. రోజూ తాగివచ్చి కొడుతున్న కొడుకు తీరును తట్టుకోలేకపోయారు. మంగళవారం రాత్రి ఎప్పటిలాగే తాగివచ్చిన కొడుకు తమమీద చెయ్యి చేసుకోవడంతో ప్రభాకర్ దంపతులు ఎదురు తిరిగారు.
 
మద్యంమత్తులో ఉన్న చంద్రను పట్టుకుని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకునేసరికి చంద్ర పూర్తిగా కాలిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments