Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిక్ టాక్ లవ్: ఇద్దరు తెలంగాణ యువతులను వచ్చేయమన్న అనంత కుర్రాళ్లు, కానీ...

Advertiesment
Tick Tok Love
, శుక్రవారం, 8 నవంబరు 2019 (17:05 IST)
టిక్ టాక్ పరిచయంలో ప్రేమలో పడిన ఇద్దరూ యువతులు తాము ప్రేమించిన యువకులను కలిసేందుకు గురువారం రాత్రి అనంతపురం జిల్లా దర్గాహోన్నూరు గ్రామానికి చేరుకున్నారు. సిద్దిపేట జిల్లా గద్వాల్ మండలం ముక్తమాసాస్ పల్లె గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు టిక్ టాక్ యాప్ ద్వారా దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన వంశీ, వన్నూరు స్వామి అనే డిగ్రీ విద్యార్థులతో 6 నెలల క్రితం పరిచయం ఏర్పడింది.
 
ఆ పరిచయం క్రమంగా పెరిగి పెళ్లి దాకా వచ్చింది. యువకుల మాటలు నమ్మి ఆంధ్రాకు వెళ్తున్నామని ఇంటిలో చెప్పి బుధవారం గద్వాల్ నుంచి రైలులో బయలుదేరారు. గుంతకల్లుకు చేరుకొని అక్కడి నుంచి దర్గా హోన్నూరు గ్రామానికి గురువారం రాత్రి చేరారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత యువకులు మాట మార్చడంతో వీరు విచారిస్తుండగా గ్రామస్తులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. 
 
సమస్య కొలిక్కి రాకపోవడంతో గ్రామస్తులు బొమ్మనహల్ మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా యువతులను కళ్యాణ్ దుర్గంలోని ఉజ్వల హోమ్‌కు తరలించారు. అక్కడి నుండి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అప్పగిస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ముందు ఇక్కడ మూడ్ ఎలా ఉంది? - గ్రౌండ్ రిపోర్ట్