Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు.. మార్చికి వాయిదా

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (16:03 IST)
Krishna
కృష్ణాజలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ వెల్లడించింది. కృష్ణా జలాల నీటిని రెండు రాష్ట్రాలు వాస్తవంగా వినియోగాన్ని నిర్ణయించాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. 
 
ప్రస్తుతం నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నీటి వినియోగాన్ని లెక్కించి రెండు రాష్ట్రాల వాస్తవ నీటి వినియోగాన్ని నిర్ణయించాలని తెలంగాణ సర్కారు కేఆర్ఎంబీని కోరింది. ఇందులో భాగంగా శుక్రవారం కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ముందు తెలంగాణ ఇన్ చీఫ్ మురళీధర్ ప్రభుత్వ వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని లెక్కించడం ద్వారా ప్రతి ఒక్కరూ వాస్తవంగా ఎంత నీటిని ఉపయోగించారు. 
 
నీటి వినియోగంలో తెలంగాణకు సరైన వాటా రావట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.  ప్రస్తుత సంవత్సరంలో ఏపీ ఇప్పటికే  తన కోటా కంటే ఎక్కువగా కృష్ణానీటిని వినియోగించుకుందని ఇరిగేషన్ అధికారి బోర్డు దృష్టికి తీసుకొచ్చారు.
 
తెలంగాణకు ఇంకా 141 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం వుండగా, తెలంగాణ వాదనల అనంతరం ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి గైర్హాజరు కావడంతో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. తదుపరి విచారణ మార్చిలో జరిగే అవకాశం వుందని కమిటీ సభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments