Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బక్క ప్రాణం ఏదైనా సేత్తడని భయం... అందుకే వారిద్దరికి వణుకు : కేసీఆర్

దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు రావాలని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఫ్రంట్ (ఫెడరల్) ఎంతో అవసరమని వ్యాఖ్యలు చేయగానే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పోశాయని తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (16:40 IST)
దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు రావాలని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఫ్రంట్ (ఫెడరల్) ఎంతో అవసరమని వ్యాఖ్యలు చేయగానే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పోశాయని తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
 
హైదరాబాద్‌లో జరుగుతున్న తెరాస ప్లీనరీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఇటీవలే ఫెడరల్ ఫ్రంట్ గురించి తాను చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏజెంట్ కేసీఆర్ అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఫ్రంట్‌కు టెంటే లేదని బీజేపీ నేతలు అంటున్నారు. టెంటే లేనప్పుడు బీజేపీ నేతలకు భయమెందుకు? అని ప్రశ్నించారు. కేసీఆర్ అంటే అందరికీ భయం.. కేసీఆర్ మొండి కదా.. అది భయం. కేసీఆర్ ఏదైనా అనుకుంటే చేసి చూపిస్తాడు. అందుకే వారికి భయం అని అన్నారు. 
 
తెలంగాణను ఎట్ల అయితే తెచ్చి చూపిన్నో.. దేశం మంచి కోసం కూడా ఆ విధంగా పని చేస్తాను. ఎవ్వరికీ భయపడను. మీ అందరి సహకారంతో ముందుకు పోతాను. జాతీయ రాజకీయాల్లో తెరాస క్రియాశీలక పాత్ర పోషించే బాధ్యతను ప్రజలు అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ఈ రెండు పార్టీల అసమర్థత పాలన వల్ల దేశంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. అంతేకాకుండా, ఇన్నాళ్లూ పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ దేశాన్ని సర్వనాశనం చేశాయన్నారు. రాష్ట్రాలపైనా కేంద్రం పెత్తనమేంటని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments