Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు బద్ధశత్రువులు.. నేడు బెస్ట్ ఫ్రెండ్స్ : కేసీఆర్‌తో పయ్యావుల ఏకాంత చర్చలు!

తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస అధినేత కేసీఆర్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అనేక రకాలైన విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు దీంతో వారిద్దరి మధ్య వైరానికి దారితీశాయి కూడా. ముఖ్యంగా రాష్ట్ర విభజనను పయ్య

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (18:16 IST)
తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస అధినేత కేసీఆర్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అనేక రకాలైన విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు దీంతో వారిద్దరి మధ్య వైరానికి దారితీశాయి కూడా. ముఖ్యంగా రాష్ట్ర విభజనను పయ్యావుల తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతపురం వేదికగా చేసుకుని విద్యార్థులతో ఉద్యమం కూడా నడిపారు. దీంతో కేసీఆర్, పయ్యావులలు బద్ధశత్రువులుగా మారారు. 
 
అయితే, అదంతా గతం. రాష్ట్ర విభజన జరిగిపోయి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆదివారం అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 
 
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఈ వివాహా వేడుకకు హాజరైన కేసీఆర్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌తో కొంచెం సేపు మాట్లాడినట్టు సమాచారం. ఐదారు నిమిషాల పాటు ఆయనతో కేసీఆర్ ఏకాంతంగా సంభాషించారని, ముఖ్యంగా, ఏపీ రాజకీయాలపై, ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికలపైనా ఆరా తీశారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల గురించీ పయ్యావులతో కేసీఆర్ మాట్లాడినట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments