కోడిమాంసం ధరలకు రెక్కలొచ్చాయి... కేజీ చికెన్ రూ.300కు చేరువలో..

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (10:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో కోడిమాంసం ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా, స్కిన్‌లెస్ చికెన్ ధర అమాంతం పెరిగిపోయింది. నిజానికి ఈ ధరల పెరుగుదల గత రెండు వారాలుగా కొనసాగుతోంది. 
 
ఈ పరిస్థితుల్లో ఆదివారం స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర ఒకేసారి రూ.260కి పెరిగింది. మార్చి 21న రూ.220 ఉండగా, 28 నాటికి రూ.200కు తగ్గింది. అయితే మళ్లీ ధర భగ్గుమంటోంది. ఇటీవల రిటైల్‌ మార్కెట్‌లో కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ.230 ఉండగా, అదనంగా రూ.30 పెరిగింది. నాలుగు నెలల క్రితం స్కిన్‌లెస్‌ రూ.120 నుంచి రూ.140 వరకు ఉండేది. అయితే కొన్నిసార్లు ధర పెరగడం, మరికొన్నిసార్లు తగ్గడం జరుగుతోంది. 
 
గతేడాది కరోనా సమయంలో చికెన్‌ అమ్మకాలు చాలా తగ్గిపోయాయి. కరోనా విషయంలో చికెన్‌పై ఉన్న అనుమానాలు తొలగిపోవడంతో చాలా మంది మళ్లీ చికెన్‌ తినడం ప్రారంభించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చికెన్‌ వినియోగం కాస్త తగ్గి ధరలు కూడా తగ్గాయి. మళ్లీ మార్చి మూడో వారం నుంచి ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. 
 
ప్రస్తుతం ఎండలు బాగా ఉండడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గత ఏడాది కంటే కోళ్ల ఉత్పత్తి ఈ ఏడాది చాలా తక్కువగా ఉందని వ్యాపారులు వివరించారు. మరోవైపు మటన్‌ కిలో రూ.700 నుంచి రూ.800 వరకు పలుకుతోంది. దీంతో చికెన్‌ కొనేవారు పెరగడంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments