Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు బెయిల్ రద్దు భయం పట్టుకుంది.. అందుకే పప్పుబెల్లాలు... : వైకాపా ఎంపీ

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోన్ రెడ్డికి బెయిల్ రద్దు భయంపట్టుకుందని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. అందుకే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అనర్హులకు కూడా సంక్షేమపథకాల పేరుతో పప్పుబెల్లాలను పంచిపెడుతున్నారని ఆరోపించారు. 
 
ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తన బెయిల్‌ రద్దయి జైలుకు పోతానన్న భయం జగన్‌కు పట్టుకుందన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైనప్పటికీ జగన్ ఏమాత్రం పట్టించుకోకుండా, అపరిమితమైన అప్పులు చేసి ప్రజల మెప్పు కోసం సంక్షేమం ముసుగులో పప్పుబెల్లాలు పంచిపెడుతున్నారని ఆరోపించారు. 
 
ఒకవేళ తాను జైలుకు వెళ్తే... జగన్‌ జైల్లో ఉన్నందువల్లే పథకాలు అందడం లేదని ప్రజలు అనుకోవాలని భావిస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ‘అనర్హులకు కూడా విచ్చలవిడిగా సంక్షేమాన్ని అమలు చేయడం కేవలం ఓట్ల రాజకీయం కోసమే. సంపద సృష్టించకుండా ఖజానాను కొల్లగొడుతూ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం సమంజసం కాద’ని విరుచుకుపడ్డారు. 
 
అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వోద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి రావడం బాధాకరమన్నారు. 3.6 లక్షల మంది పింఛనుదారులకూ ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. సంక్షేమం పేరుతో ఖజానా లూటీ చేసి ఉద్యోగులకు జీతాలివ్వరా అని ప్రశ్నించారు. ఇవే పరిస్థితులు కొనసాగితే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం ఆందోళనకరంగా ఉంటుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments