Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ జెన్‌కోకు రూ.6756.92 కోట్లు చెల్లించాల్సిందే : కేంద్రం స్పష్టీకరణ

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (08:39 IST)
ఏపీ జెన్‌కోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.6,756.92 కోట్లు చెల్లించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. విద్యుత్ సరఫరా బిల్లు రూ.3,441.78 కోట్లతో పాటు.. సర్ చార్జి కింద రూ.3,315.14 కోట్లను కలిపి మొత్తం రూ.6,756.92 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. పైగా, విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం ఏపీ జెన్‌‍కోకు నిధులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంటూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటీ అనూప్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 నింబంధనల మేరకు కేంద్రం ఆదేశాలతో తెలంగాణకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసిందని, అందువల్ల ఇపుడు విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని ఇంధన శాఖ కార్యదర్శి తన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. 
 
అదేసమయంలో విభజన జరిగిన తర్వాత విద్యుత్ సరఫరా జరిగిందని పేర్కొంటూ ఈ విద్యుత్ బకాయిలను కూడా విభజన సమస్యలతో ముడిపెట్టడం వీల్లేదని స్పష్టం చేశారు. అందువల్ల 30 రోజుల్లోపు మొత్తం బకాయిలను చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments