Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ జెన్‌కోకు రూ.6756.92 కోట్లు చెల్లించాల్సిందే : కేంద్రం స్పష్టీకరణ

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (08:39 IST)
ఏపీ జెన్‌కోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.6,756.92 కోట్లు చెల్లించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. విద్యుత్ సరఫరా బిల్లు రూ.3,441.78 కోట్లతో పాటు.. సర్ చార్జి కింద రూ.3,315.14 కోట్లను కలిపి మొత్తం రూ.6,756.92 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. పైగా, విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం ఏపీ జెన్‌‍కోకు నిధులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంటూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటీ అనూప్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 నింబంధనల మేరకు కేంద్రం ఆదేశాలతో తెలంగాణకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసిందని, అందువల్ల ఇపుడు విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని ఇంధన శాఖ కార్యదర్శి తన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. 
 
అదేసమయంలో విభజన జరిగిన తర్వాత విద్యుత్ సరఫరా జరిగిందని పేర్కొంటూ ఈ విద్యుత్ బకాయిలను కూడా విభజన సమస్యలతో ముడిపెట్టడం వీల్లేదని స్పష్టం చేశారు. అందువల్ల 30 రోజుల్లోపు మొత్తం బకాయిలను చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments