Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ మృతి కేసు : ఆ నలుగురి వద్ద విచారించండి .. రిటైర్డ్ జస్టిస్ ఆర్ముగస్వామి

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (08:20 IST)
మాజీ మఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి దివగంత జయలలిత మృతి కేసులో ఆ నలుగురి వద్ద విచారించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాజీ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ అంశం ఇపుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. 
 
ఇంతకీ ఈ నలుగురు ఎవరో కాదు.. జయలలిత స్నేహితురాలు శశికళ, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విజయభాస్కర్, తమిళనాడు ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు, జయలలిత వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్‌లు. ఈ నలుగురు వద్ద విచారణకు ఆదేశించాలని కమిషన్ సిఫార్సు చేసింది. 
 
అయితే, ఈ వ్యవహారంలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని తమిళనాడు మంత్రిమండలి సోమవారం సమావేశమైన తీర్మానించింది. 
 
అలాగే, తూత్తుక్కుడి కాల్పులకు సంబంధించి 17 మంది పోలీస్ ఉన్నతాధికారులు, నాటి జిల్లా కలెక్టర్‌ సహా నలుగురు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ జస్టిస్ అరుణా జగదీశన్ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై కూడా చర్చించిన కేబినెట్... ఆ మేరకు చర్యలకు సంబంధించి ఆయా శాఖకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments