Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీ వెనుక స్నేహితుడితో యువతి, బలవంతంగా లాక్కెళ్లి గ్యాంగ్ రేప్...

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (20:19 IST)
చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థినిని కొంతమంది యువకులు బలవంతంగా ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు. జిల్లాలో ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
మదనపల్లిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ ఇసిఈ చదువుతున్న విద్యార్థిని తన స్నేహితుడితో మధ్యాహ్నం కళాశాల వెనుక మాట్లాడుతూ నిలబడింది. వీరిద్దరు ఏకాంతంగా ఉండడాన్ని చూసిన మదనపల్లిలోని అంగళ్ళుకు చెందిన జయచంద్ర, అప్ఝల్ విద్యార్థిని స్నేహితుడిని చితకబాది అమ్మాయిని బలవంతంగా స్కూటర్ పైన ఎత్తుకెళ్ళారు.
 
విద్యార్థిని కేకలు వేయడం అక్కడున్న వారందరూ చూశారు. ఏదో ఫ్రెండ్సే ఆటపట్టిస్తున్నారనుకుని ఊరుకున్నారు. అయితే ఆ ఇద్దరు యువకులు విద్యార్థిని హంద్రీ..నీవా ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. తన స్నేహితుడు షామీర్‌కు ఫోన్ చేసి అక్కడకు పిలిపించి అతనితో కూడా ఆమెపై అత్యాచారం చేసే విధంగా ప్రోత్సహించారు. ముగ్గురు కలిసి ఆ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి వదిలేశారు.
 
విద్యార్థిని ఆ యువకుల నుంచి బయటపడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. పోలీసుల ఫిర్యాదుతో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం