Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని చేస్తుంటే పేలిపోయిన ల్యాప్‌టాప్ - టెక్కీకి తీవ్ర గాయాలు

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. పని చేస్తున్న సమయంలో ల్యాప్‌టాప్ పేలిపోయింది. దీంతో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా బి.కోడూరు మండలం, మేకవారి పల్లెంకుచెందిన సుమలత (22) అనే టెక్కీ బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కావడంతో ఆమె ఇంటి వద్ద నుంచే పని చేస్తుంది. అయితే, సోమవారం ఉదయం 8 గంటలకు ల్యాప్‌టాప్‌‍కు చార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా, అది ఒక్కసారిగా పేలిపోయింది. 
 
దీంతో మంటలు చెలరేగి ఆమె దుస్తులకు అంటున్నాయి. గదిలో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా, సుమలత స్పృహతప్పి కిందపడిపోయిందివుంది. ఆ వెంటనే ఆ యువతిని జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరిలంచారు. ఆ యువతి శరీరం దాదాపు 80 శాతం మేరకు కాలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments