Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని చేస్తుంటే పేలిపోయిన ల్యాప్‌టాప్ - టెక్కీకి తీవ్ర గాయాలు

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. పని చేస్తున్న సమయంలో ల్యాప్‌టాప్ పేలిపోయింది. దీంతో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా బి.కోడూరు మండలం, మేకవారి పల్లెంకుచెందిన సుమలత (22) అనే టెక్కీ బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కావడంతో ఆమె ఇంటి వద్ద నుంచే పని చేస్తుంది. అయితే, సోమవారం ఉదయం 8 గంటలకు ల్యాప్‌టాప్‌‍కు చార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా, అది ఒక్కసారిగా పేలిపోయింది. 
 
దీంతో మంటలు చెలరేగి ఆమె దుస్తులకు అంటున్నాయి. గదిలో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా, సుమలత స్పృహతప్పి కిందపడిపోయిందివుంది. ఆ వెంటనే ఆ యువతిని జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరిలంచారు. ఆ యువతి శరీరం దాదాపు 80 శాతం మేరకు కాలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments