Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కాలు రాయలేదనీ విద్యార్థి బుగ్గలు వాచిపోయేలా చెంపదెబ్బలు కొట్టిన పంతులమ్మ!

గురువు అంటే పాఠం చెప్పేవాడు. శిష్యుడు అంటే పాఠం వినేవాడు. అయితే గురుశిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త, శ్రోతల్లాగానే ఉంటుంది. అలాంటిది చిన్నారులకు ప్రేమగా పాఠాలు చెప్పాల్సిన టీచరే సహనం కోల్పోయి మృగంలా ప్రవర

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (12:54 IST)
గురువు అంటే పాఠం చెప్పేవాడు. శిష్యుడు అంటే పాఠం వినేవాడు. అయితే గురుశిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త, శ్రోతల్లాగానే ఉంటుంది. అలాంటిది చిన్నారులకు ప్రేమగా పాఠాలు చెప్పాల్సిన టీచరే సహనం కోల్పోయి మృగంలా ప్రవర్తించింది. ఎక్కాలు సకాలంలో రాయలేదన్న కోపంతో రెండో తరగతి విద్యార్థి చెంపలు వాసేలా కొట్టింది. ఈ సంఘటన వలేటివారిపాలెం మండలంలోని నూకవరం ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
 
గ్రామానికి చెందిన పొనుగోటి రాజు రెండో తరగతి చదువుతున్నాడు. సోమవారం పంతులమ్మ విద్యార్థులకి రెండో తరగతి ఎక్కాలు రాయడానికి పది నిమిషాల సమయాన్ని కేటాయించింది. ఇచ్చిన సమయంలో అందరూ పూర్తి చేశారు. కానీ రాజు సకాలంలో రాయలేకపోవడంతో ఉపాధ్యాయురాలికి కోపం కట్టలు తెంచుకుంది. రాజుని గట్టిగా చెంపదెబ్బలు కొట్టారు. దీంతో రాజు బుగ్గలు గులాబీ పువ్వులా కందిపోయాయి. 
 
టీచర్ ఆగ్రహానికి బిత్తరపోయిన రాజు... చడీచప్పుడు కాకుండా పాఠశాల నుంచి పరుగో పరుగున పారిపోయాడు. సాయంత్రం అయిన కొడుకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు వెతుక్కుంటూ పాఠశాలకు వచ్చారు. అక్కడ లేకపోవడంతో ఊరంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ కనపడలేదు. చివరకు పొలాల్లో కనిపించిన రాజు.. అసలు విషయం చెప్పడంతో టీచర్ గుట్టురట్టయ్యింది. సదరు ఉపాధ్యాయురాలు గతంలో కూడా ఇదేవిధంగా వేరే విద్యార్థిని చితకబాదిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రాజు తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments