డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

సెల్వి
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (15:58 IST)
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీ డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంది. డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 50 మంది కార్పొరేటర్లలో 47 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియకు హాజరయ్యారు. 
 
తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్-అఫిషియో సభ్యులుగా పాల్గొన్నారు. ఎన్నికల్లో మునికృష్ణకు 26 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డికి 21 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు తర్వాత, అధికారులు మునికృష్ణను విజేతగా ప్రకటించారు.
 
మరోవైపు తన విజయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంకితం చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ మునికృష్ణ తెలిపారు. తన విజయానికి మద్దతునిచ్చిన కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేయడంతోనే తన గెలుపు సాధ్యమైందన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానానికి జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మండవ కృష్ణకుమారి విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments