తెదేపా సీనయర్ నేత, మాజీ మంత్రి గారపాటి ఇకలేరు

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (13:10 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు ఇకలేరు. అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. ఆయనకు వయసు 75 యేళ్ళు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన బుధవారం ఉదయం మృతి చెందారు. 
 
ఆయన స్వగృహం పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెం. ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంతో అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 
 
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మరణం విచారకం. ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన సాంబశివ రావు దెందులూరు నుంచి నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా కూడా పని చేసి తనదైన ముద్ర వేశారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments