Webdunia - Bharat's app for daily news and videos

Install App

7న టీడీపీ నిరసన కార్యక్రమాలు: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:29 IST)
రాష్ట్రంలో 80 నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలపై 7వ తేదీ నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

జగన్&కో అవినీతి, దుబారాలే నేటి ఆర్థిక సంక్షోభానికి కారణమన్నారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఎక్కడా తట్ట మట్టి పోయలేదన్నారు.

రోడ్డు సెస్ రూ.1200 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. దారిమళ్లించిన నిధులను తిరిగి ఇచ్చి వెంటనే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. 
 
రెండేళ్లయినా ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయకపోవడం కోర్టు ధిక్కరణ చర్య అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

సమస్యను పక్కదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. హోంమంత్రి డమ్మీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీఎస్ డీసీ ద్వారా అప్పులు తీసుకువచ్చి ఉద్దేశపూర్వకంగా మోసం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments