Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు - భవనమెక్కి టీడీపీ సభ్యుల ఆందోళన

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో భాగంగా, మంగళవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. అయితే, అధికార వైకాపా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి తెలుగుదేశం పార్టీ నేతలు యత్నించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెదేపా సభ్యులు అసెంబ్లీకి సమీపంలో ఉన్న ఓ భవనంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. 
 
భవనంపై ఆందోళనకు దిగిన నేతల్లో కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. 
 
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా భవనం నుంచి పైనుంచి కింద దించారు. వారిని అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments