Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా నేతలను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:58 IST)
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన తెదేపా నేతలు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన శారద, కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించారు. వైసీపీ రౌడీమూకల దౌర్జన్యకాండపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడి ఏ విధంగా జరిగిందో, ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

మూడు రోజుల క్రితం జోగి రమేష్‌ అనుచరుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేష్‌ను తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ మీకు అన్నివిధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments