Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం : ఆ అంశంపైనే కీలక చర్చ!

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (12:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అదే రోజు ఉదయం ఏపీ మంత్రి మండలి సమావేశం జరుగనుంది. ఇందులో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం బుధవారం జరుగనుంది. 
 
ఇందులో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై పొలిట్‌బ్యూరో సభ్యులు సమీక్ష చేయనున్నారు. అలాగే, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా సభ్యులు అసభ్య ప్రవర్తనతో తీవ్రంగా కలత చెందిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సభలో మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని శపథం చేసి సభ నుంచి వెళ్ళిపోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments