Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చచ్చాక.. దివాకర్ రెడ్డి అనేవాడు ఒకడున్నాడని చెప్పుకోవాలి: జేసీ

ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు. ఆ సమయంలో టీడీపీ అనంతపురం జిల్లా పయ్యావుల కేశవ్‌, సీఎం కేసీఆర్‌ల మధ్య కొన్ని నిమిషా

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (07:26 IST)
ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు. ఆ సమయంలో టీడీపీ అనంతపురం జిల్లా పయ్యావుల కేశవ్‌, సీఎం కేసీఆర్‌ల మధ్య కొన్ని నిమిషాలు ఏకాంత చర్చలు జరిగాయి. వీటిపై మీడియాలో పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరి ఏకాంత చర్చలపై అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. 'రహస్య మంతనాలని నేనైతే అనుకోను. మా అందరికీ కేసీఆర్ బాగా తెలుసు. మమ్మల్ని అందరినీ పేరుపెట్టి పిలుస్తాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 'ఏమయ్యా, కేశవ్ ఎట్లా ఉన్నావు?' అంటూ భుజం మీద చేయి వేసుకుని అలా పక్కకుపోయాడు. అంతేగానీ, దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడంలో అర్థం లేదు' అని జేసీ చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే... మా ప్రజలు బాగుండాలి, మేము బాగుండాలని తాను కోరుకుంటానని చెప్పారు. ‘నేను రాజకీయాల్లో ఉండి ఒక మంచి కార్యక్రమం చేయకపోతే ఎట్లా! నాకు ఒకటే ఆశ ఉంది.. మనం చచ్చిపోయిన తర్వాత, మనం పైకి పోయిన తర్వాత కూడా నాలుగైదు సంవత్సరాలు మన పేరు తలచుకునేటట్టు ఉండాలి. దివాకర్ రెడ్డి అనేవాడు ఉండేవాడు, ఫలానా పని చేసి పోయాడనే మంచిపేరు రావాలనేదే నా ఆశ’ అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments