Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ కాళ్ళు మొక్కలేదని విజయసాయి చెపుతారా?

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు. రాజ్యసభలో ప్రధాని మోడీ కాళ్లకు విజయసాయిరెడ్డి మొక్కాలేదని గుండెలపై చేయి వేసుకుని చెపుతారా అంటూ నిలదీశారు.

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (15:03 IST)
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు. రాజ్యసభలో ప్రధాని మోడీ కాళ్లకు విజయసాయిరెడ్డి మొక్కాలేదని గుండెలపై చేయి వేసుకుని చెపుతారా అంటూ నిలదీశారు. 
 
పార్లమెంటులో మోడీ కాళ్లపై పడతారని, బయటకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ కాళ్లపై పడలేదననే విషయాన్ని గుండెపై చేయి వేసుకుని చెప్పాలని విజయసాయికి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాలను విజయసాయి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. అవిశ్వాసం తీర్మానం పేరుతో వైసీపీ నాటకాలాడుతోందని... వైసీపీ అసలు బండారం మంగళవారం బయటపడిందని ఎద్దేవా చేశారు. 
 
మరో ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ, ప్రధానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదాభివందనం చేయడంతో అతని నిజస్వరూపం బయటపడిందన్నారు. వైసీపీది చిత్తశుద్ది లేని పోరాటమన్నారు. ఎంపీల పదవులకు రాజీనామా చేసినా సంవత్సరం వరకు స్పీకర్ ఆమోదించకుండా ఒప్పందం కుదుర్చుకుంటారని ఆరోపించారు. రాష్ట్రంలో కోసం పోరాటం అంటూనే పాదాభివందనం చేస్తారని దుయ్యబట్టారు.
 
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా కేంద్రం నుంచి బయటకు వచ్చామన్నారు. తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుపకుండా బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ పారిపోతోందని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం దేశవ్యాప్తంగా తెలుస్తుందనే తీర్మానంపై చర్చ జరుగనీయడం లేదని ఆరోపించారు. దమ్ముంటే... నిజాయితీ ఉంటే పార్లమెంట్ సాక్షిగా చర్చ జరపాలని ఎంపీ సవాల్ విసిరారు. 
 
ఇదిలావుంటే, హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ వైసీపీ, పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీలు కూడా ఇటీవల డిమాండ్ చేశాయి. దీనిపై ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ స్పందిస్తూ, టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్‌లో పోరాడేది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చి వైసీపీ నాటకాలాడుతోందని దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments