తప్పు చేస్తే తలదించుకుంటా... లేదంటే తాట తీస్తా.. నాకు ఏదీ లెక్కలేదు : ఎమ్మెల్యే గుమ్మనూరు

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (12:51 IST)
తన గురించి అసత్య కథనాలు రాస్తే పట్టాలపై పడుకోబెడతానని అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తారని, వాటిని నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతామని హెచ్చరించారు. గుంతకల్లు దాని ముక్కల రోడ్డులోని జగనన్న కాలనీని మంగళవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా.. తన గురించి ఓ న్యూస్ చానల్లో వచ్చిన ఓ కథనంపై ఆయన తీవ్రస్వరంతో స్పందించారు. 
 
'నా అనుచరులు, బంధువులు ఎవరినో రైలు పట్టాలపై పడుకోబెట్టి ఆస్తులు రాయించుకున్నారని, స్థలాలను కబ్జా చేశారని, కర్ణాటక మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారని, ఇసుక దందా నడుపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడ అవినీతికి పాల్పడ్డానో న్యూస్ చానళ్లు, పత్రికలవారు నిరూపించాలి. తప్పు చేసినట్లు నిరూపిస్తే తల దించుకుంటాను. లేదంటే తాట తీస్తాను. నాకు ఏదీ లెక్కలేదు. అన్నీ చేసాచ్చినోడినే' అని హెచ్చరించారు. 
 
మరోవైపు, ఎమ్మెల్యే గుమ్మనూరుకు టీడీపీ అధిష్టానం మందలించింది. స్థానికంగా ఉండే పాత్రికేయులను ఎమ్మెల్యే దుర్భాషలాడారని, ఏబీఎన్ పాటు మరికొన్ని చానల్స్ వార్తా కథనాలు ప్రసారం చేశాయి. దీంతో జయరాంకు ఫోన్ చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పాత్రికేయులను దుర్భాషలాడటం టీడీపీ సంస్కృతి కాదని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యేకు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments