Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాతపై కేసు

విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు రిజిస్టేషన్ చేయించు

Webdunia
ఆదివారం, 28 జనవరి 2018 (17:30 IST)
విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు రిజిస్టేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 
 
బాధితులు ఫిర్యాదు చేయడంతో సీఐడీ అధికారులు దర్యాప్తు మొదలెట్టారు. ఈ క్రమంలో సుజాతతో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలో విజయవాడ నగరంలో ఓ భూ ఆక్రమణకు సంబంధించిన వ్యవహారంలో బోండా ఉమా ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, మరో భూవివాదంలో బోండా ఉమ సతీమణిపై కేసు నమోదుకావడం సంచలనానికి దారితీస్తోంది.
 
అయితే అయితే, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే బోండా ఉమ కొట్టి పారేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అబ్దుల్ మస్తాన్ అనే వ్యక్తి నుంచి రవితేజ బయోటెక్ అనే కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న తన భార్య సుజాత పేరు మీద డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రాయించుకుని తీసుకున్నట్లు బోండా ఉమ చెప్పారు. 
 
భూమి ఎవరిదో తమకు తెలియదని.. దీనికి సంబంధించి సురేష్, మస్తాన్‌ల మధ్య వివాదం నడుస్తుందన్నారు. ఈ వివాదం గురించి తెలియరావడంతో డెవలప్‌మెంట్ కోసం తీసుకున్న అగ్రిమెంటును కూడా రద్దు చేసుకున్నామని బోండా ఉమ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments