Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కలుసుకోకుండా జీవో నెంబర్ 2 : టీడీపీ నేతల వ్యంగ్యాస్త్రాలు

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (16:49 IST)
హైదరాబాద్ నగరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు ఆదివారం సమావేశమయ్యారు. భాగ్యనగరిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం వైకాపా నేతల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ భేటీపై ఏకంగా ఏడుగురు మంత్రులు ఎదురుదాడికి దిగారు. అదేసమయంలో టీడీపీ నేతలు కూడా తమదైనశైలిలో తిప్పికొట్టారు. వైకాపా నేతలపై వ్యంగ్యస్త్రాలు కూడా సంధించారు. 
 
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ, తమ శాఖల పురోగతిపై ఏనాడూ స్పందించని మంత్రులు ఈ భేటీపై మాత్రం అతిగా స్పందించారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాఫీ తాగేందుకు కలిస్తే 12 మంది మంత్రులు స్పందించారు. ఇక ఇద్దరు కలిసి భోజనం చేస్తే ఈ మంత్రులు ఏమైపోతారో అంటూ వ్యాఖ్యానించారు. మున్ముందు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకుండా జీవో నెంబరు 2 తీసుకువస్తారేమో అంటూ అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యం ప్రదర్శించారు. 
 
కాగా, హైదరాబాద్‌లో జరిగిన భేటీ కోసం చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లారు. వారిద్దరూ దాదాపు రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. ఇటీవల విపక్ష నేతల ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించకుండా వైకాపా ప్రభుత్వం జీవో నంబరు 1ని తీసుకొచ్చింది. దీంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఇది వైకాపా మంత్రులు, నేతలు జీర్ణించుకోలేక, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments