Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖల వెల్లువ‌!

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:46 IST)
వినాయక చవితి ఉత్సవాలపై టీడీపీ నేత‌లు వినూత్నంగా లేఖలు రాస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 175 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంకి లేఖ‌లు సంధించారు. గ‌ణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని లేఖలో టీడీపీ నేతలు కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, వేడుకల్లో పాల్గొంటామని, త‌మ‌ని అనుమ‌తించాల‌ని టీడీపీ నేతలు లేఖ‌లో కోరారు.
 
వినాయక చవితి ఉత్సవాలపై  ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ, సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖలు ఇపుడు కొత్త ప్ర‌యోగంగా మారింది. మూకుమ్మ‌డిగా 175 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను  నిషేధించడం భక్తుల మనోభావాలకు విరుద్ధమన్నారు.

గణేష్ ఉత్సవాలను  పొరుగు రాష్ట్రం తెలంగాణలో రద్దు చేయలేదని తెలిపారు. కరోనా సాకుతో మన రాష్ట్రంలోనే రద్దు చేయడం దారుణమన్నారు. గణేష్ ఉత్సవాలకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments