Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖల వెల్లువ‌!

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:46 IST)
వినాయక చవితి ఉత్సవాలపై టీడీపీ నేత‌లు వినూత్నంగా లేఖలు రాస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 175 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంకి లేఖ‌లు సంధించారు. గ‌ణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని లేఖలో టీడీపీ నేతలు కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, వేడుకల్లో పాల్గొంటామని, త‌మ‌ని అనుమ‌తించాల‌ని టీడీపీ నేతలు లేఖ‌లో కోరారు.
 
వినాయక చవితి ఉత్సవాలపై  ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ, సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖలు ఇపుడు కొత్త ప్ర‌యోగంగా మారింది. మూకుమ్మ‌డిగా 175 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను  నిషేధించడం భక్తుల మనోభావాలకు విరుద్ధమన్నారు.

గణేష్ ఉత్సవాలను  పొరుగు రాష్ట్రం తెలంగాణలో రద్దు చేయలేదని తెలిపారు. కరోనా సాకుతో మన రాష్ట్రంలోనే రద్దు చేయడం దారుణమన్నారు. గణేష్ ఉత్సవాలకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments