Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాప‌ట్ల టీడీపీ కార్యాలయ నిర్మాణంపై అధినేత చంద్రబాబుతో చ‌ర్చ‌

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:13 IST)
గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం అద్భుతంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ లు, బాపట్ల పార్లమెంట్ కార్యాలయం నిర్మాణంపై అధినేతకు వివరించారు. 
 
బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి బాపట్లకు చెందిన కీర్తిశేషులు మువ్వా సుబ్బారావు 9 సెంట్ల భూమిని అందించారని అధినేతకు తెలిపారు. పార్టీ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి సమగ్ర మ్యాప్ లు, ప్రణాళికను అధినేత తిలకించారు. నాయకులు అందరూ సమిష్టిగా పార్టీ కార్యాలయ నిర్మాణానికి పూనుకోవాలని, పార్టీ కార్యాలయం మంచి వాతావరణం ఉండేలా అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో  పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తాని కొండ దయ బాబు, పార్టీ సీనియర్ నాయకులు జీవి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments