Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి బ్లాంక్ జీవోలు ఆపించండి.. గవర్నర్‌కు టీడీపీ నేతల వినతి

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (15:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌ను టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌‌లు శుక్రవారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బ్లాంక్‌, రహస్య జీవోల వ్యవహారంపై గవర్నర్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. 
 
అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. 12 రోజుల్లో 50 బ్లాంక్‌ జీవోలు ఇచ్చారని.. వాటిలో తేదీ, జీవో నంబర్‌ మాత్రమే ఉంటోందన్నారు. పారదర్శక పాలన ఎందుకు చేయలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
 
బ్లాంక్‌ జీవోలను చూపితే గవర్నర్‌ ఆశ్చర్యపోయారన్నారు. ఇకనైనా అర్థరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేయడాన్ని మానుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. జీవోలు గవర్నర్ పేరుతో జారీ చేస్తారని.. ఈ విషయంలో ఆయన కూడా బాధ్యత వహించాలని గద్దె రామ్మోహన్‌ కోరారు. దీనిపై విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments