Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి జీవోలు - ఏసీబీ తనిఖీలు ఆపండి : బొప్పరాజు

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (15:18 IST)
ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా నడుచుకోవద్దని హితవు పలికారు. ముఖ్యంగా, అర్థరాత్రి జీవోలు ఆపాలంటూ డిమాండ్ చేశారు. తహసీల్దారు కార్యాలయాల్లో గతేడాది జనవరి నుంచి పలు దఫాలుగా చేపడుతున్న తనిఖీలను తక్షణం నిలిపివేయాలని కోరారు. 
 
విశాఖ జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సాధారణ పరిపాలనను ఎప్పటికప్పుడు సమీక్షించి లోటుపాట్లు సవరించడానికి ఐదు అంచెల వ్యవస్థ ఉందన్నారు. 
 
వాటిని కాదని ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం వల్ల మానసిక స్థైర్యం దెబ్బతింటోందని  ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.  లంచం తీసుకుంటూ దొరికిన, అధిక ఆదాయం, ఆస్తుల కేసుల్లో పట్టుబడిన ఉద్యోగుల విషయంలో అసోసియేషన్‌ జోక్యం చేసుకోదని బొప్పరాజు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments