Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో వైకాపా నేతలకు లాగు తడిసిపోతాద్ది : తెదేపా

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (16:29 IST)
ఏపీలో స్థానికసంస్థల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపింది. ఈ ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని వైకాపా నేతలు కోరుతున్నారు. కానీ, ఈసీ మాత్రం ముందుకు సాగుతోంది. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ జోక్యం చేసుకోవాలని కోరారు. 
 
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ అధికారం ఈసీదేనని తెల్చిచెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది గవర్నరేనని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు సహకరించమని మంత్రులు చెప్పడం దేశ చరిత్రలో లేదన్నారు. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం సీఎం జగన్‌కు లేదన్నారు. మద్యం షాపుల నిర్వహణకు లేని అభ్యంతరాలు ఎన్నికలకు ఉంటాయా అని యనమల రామకృష్ణ  ప్రశ్నించారు.
 
అలాగే, స్థానిక ఎన్నికలకు వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని అనుచరుల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు పెరిగాయన్నారు. ప్రభుత్వం వీటిని అడ్డుకోవడంలో విఫలం అయిందన్నారు.  ప్రజా సంక్షేమాన్ని సీఎం జగన్ విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కొల్లు రవీంద్ర కోరారు.
 
కరోనా దృష్ట్యా  స్థానిక ఎన్నికలకు సహకరించలేమని ఉద్యోగులు ఎలా చెపుతారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికలను వైసీపీ నాయకులు, ఉద్యోగులు ఎందుకు ఆపాలని ఎందుకనుకుంటున్నారని నిలదీశారు. నాలుగు నెలలుగా ఇళ్ల పట్టాల పంపిణీలో ఉద్యోగులు పాల్గొనలేదా అని ప్రశ్నించారు. అప్పుడు ఉద్యోగులకు లేని ఆరోగ్య భద్రత స్థానిక ఎన్నికల నగానే గుర్తుకు వచ్చాయా అని బండారు సత్యనారాయణ నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments