Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క పైసా అదనంగా వద్దు.. విభజన చట్టాన్నే అమలు చేయండి : సుజనా చౌదరి

విభజన వల్ల తీవ్రంగా నష్టంపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా అదనంగా వద్దనీ విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో తు.చ తప్పకుండా అమలుచేయాలని కోరుతున్నామని కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పుకొచ్చా

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (18:31 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టంపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా అదనంగా వద్దనీ విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో తు.చ తప్పకుండా అమలుచేయాలని కోరుతున్నామని కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పుకొచ్చారు.
 
తిరుపతి కేంద్రం టీడీపీ ధర్మ పోరాట బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇందులో ఆ పార్టీ జాతీయ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలంతా పాల్గొన్నారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరిని ఆ పార్టీ నేతలు తూర్పారబడుతున్నారు. ముఖ్యంగా, సభలో ప్రధాని మోడీ ప్రసంగాల వీడియోలను చూపిస్తూ బీజేపీ వైఖరిని ఎండగట్టనున్నారు.
 
ఈ సభలో సీనియర్ నేత సుజనా చౌదరి స్పందిస్తూ, విభజన చట్టంలో పెట్టింది మాత్రమే చేయాలని తాము అడుగుతున్నామని, ఒక్క రూపాయి కూడా ఎక్కువగా అడగడం లేదన్నారు. కొంతమంది బీజేపీ నేతలు ఏపీకి ఇప్పటికే చాలా చేశామని చెప్పుకుంటున్నారన్నారు. మొదట ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారని గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుతుందేమోనని ఆనాడు మిన్నకుండిపోయామన్నారు. 
 
అయితే, కేంద్రం అదీ కూడా ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసిందని సుజనా చౌదరి ఆరోపించారు. ఎన్డీఏపై పోరాటాన్ని మొదటి నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి మరిన్ని ఇబ్బందులు వచ్చేవన్నారు. వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. చాలా ఓపిక పట్టి చివరికి నాలుగేళ్ల తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశామని గుర్తుచేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర సర్కారుని నిలదీసి అడిగానని సుజనా చౌదరి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments