తెలుగుదేశం పార్టీకి పులివెందులలో మరో దెబ్బ.. మారుతీ వరప్రసాద్ కన్నుమూత

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (12:17 IST)
తెలుగుదేశం పార్టీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్ కన్నుమూశారు.

ప్రస్తుతం మారుతీ వరప్రసాద్ పులివెందులలో టీడీపీకి కీలక నేతగా ఉన్నారు. ఆయన మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారా లోకేష్, టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

ఈ మేరకు.. పులివెందుల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అటవీశాఖ మాజీ డైరెక్టర్ మారుతీ వరప్రసాద్ గారు మరణించడం బాధాకరమన్నారు.
 
ప్రసాద్ గారి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 
 
కాగా, కాపు కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌, టీడీపి సీనియర్‌ నేత చలమలశెట్టి రామానుజయ కూడా కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి కూడా అధినేత సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. గంటల వ్యవదిలో ఇద్దరు నేతలు మరణించడంతో ఆ పార్టీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments