విశ్వాసఘాతకులు - నలుగురు పోయారు.. 40000 వస్తారు : టీడీపీ నేత ఆలపాటి రాజా

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (16:35 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా స్పందించారు. టీడీపీని వీడినవారంతా నమ్మకద్రోహులు, విశ్వాస ఘాతుకలని ఆరోపించారు. నలగురు పోతే 40 వేల మంది వస్తారని వ్యాఖ్యానించారు. 
 
తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లతో పాటు గరికపాటి రామమోహన్ రావులు సొంతపార్టీ టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. పైగా, రాజ్యసభ టీడీపీని బీజేపీలో విలీనం చేయాల్సిందిగా వారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ ఇవ్వగా, ఆయన కూడా దానికి సమ్మతం తెలిపారు. 
 
ఈ పరిణామాలపై ఆలపాటి రాజా మాట్లాడుతూ, ఈ నలుగురు నేతలు విశ్వాసఘాతకులని రాజా ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరు బీజేపీలో చేరినా అక్కడి నేతలు మాత్రం ఈ నలుగురిని టీడీపీ కోవర్టులుగానే భావిస్తారని స్పష్టంచేశారు. 
 
టీడీపీని నలుగురు నేతలు విడిచిపెట్టిపోతే, 40 వేల మంది నాయకులు తయారు అవుతారని స్పష్టంచేశారు. కేవలం పార్టీని వీడటమే కాకుండా రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై కూడా ఆలపాటి రాజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
పోలవరం ప్రాజెక్టును చూసేందుకు జగన్మోహన్ రెడ్డికి పదేళ్లు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడ జరుగుతున్న పనులు చూశాక ఏపీ ముఖ్యమంత్రి నోరు పెగలడం లేదని దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments