Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో సరిహద్దుల్లో ఉద్రిక్తత.... తెదేపా కీలక నేతలు అరెస్టు

Webdunia
శనివారం, 10 జులై 2021 (15:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో బాక్సైట్ మైనింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. అక్కడ జరుగుతోంది బాక్సైట్ మైనింగ్ కాదని, లైటరైట్ మాత్రమేనని ప్రభుత్వం చెప్తుండగా.. విపక్షాలు మాత్రం రూ.15 వేల కోట్ల బాక్సైట్ మైనింగే జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైనింగ్ ప్రాంతాల పరిశీలనకు బయలుదేరిన టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో ఇవాళ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
పోలీసులు అరెస్టు చేసిన వారిలో టీడీపీ సీనియర్ నేతలైన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబుతో పాటు.. మరికొందరు కీలక నేతలు ఉన్నారు. పోలీసుల తీరుపై అయ్యన్న, రాజప్ప, ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను టచ్ చేయొద్దంటూ అయ్యన్న పాత్రుడు పోలీసులపై సీరియస్ అయ్యారు. పోలీసుల నుంచి కరోనా సోకితే ఎవరు బాధ్యులని అయ్యన్న నిలదీశారు.
 
బాక్సైట్ మైనింగ్ పై వాస్తవాలు తెలుసుకనేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ ఆపాలని, బాక్సైట్ తవ్వకాలు నిలిపేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంపదను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments