సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలు పేల్చిన ఈటల.... ఎం జరిగిందో వెల్లడిస్తా...

Webdunia
శనివారం, 10 జులై 2021 (14:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ మాజీ నేత, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోమారు మాటల తూటాలు పేల్చారు. ఎన్నికలు వచ్చినపుడు ఏం జరిగిందో బయటపెడతానంటూ హెచ్చరికలు చేశారు. 
 
త్వరలోనే తాను రాజీనామా చేసిన హుజురాబాద్ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నయి. ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలను పేల్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటనలో ఆయన.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
కంచె చేను మేసిన చందంగా టీఆర్ఎస్ తీరు ఉందని విమర్శించారు. తనకు వ్యతిరేకంగా.. తనను ఓడించడానికి కాంగ్రెస్ నాయకుడికి డబ్బులు ఇచ్చిన దుర్మార్గపు చరిత్ర వాళ్లది అని పేర్కొన్నారు. 
 
'పెన్షన్లు.. రేషన్లు.. ఇవ్వలేని మంత్రిపదవి ఎందుకని అడిగానని.. తప్పా అది ఏమైనా? గుట్టలు.. కంచెలు.. భూస్వాములు.. వ్యాపారులకు రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా. డబ్బులు ఎక్కువ ఉంటే… దళితులకు, బడుగులకు, నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున ఇస్తే బాగుంటుందని సూచించా' అని ఈటల వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

Winter: పూజా కార్యక్రమాలతో వింటర్ చిత్రం ప్రారంభం

దేవగుడి విజయం సాధించడం సంతోషంగా ఉంది - బెల్లం రామకృష్ణారెడ్డి

15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో బరాబర్ ప్రేమిస్తా సినిమా ఉంటుంది .. చంద్రహాస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments