Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్ డైమండ్ సంగతి ఏంటి...? ఇప్పుడు ఎందుకు నోరు మెదపడంలా...??

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (13:26 IST)
క్రైస్తవుడినని చెప్పుకునే సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వకుండా శ్రీవారికి పట్టువస్త్రాలు ఎలా సమర్పించారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల వేంకటేశ్వరుని కన్నా జగన్ అతీతుడా అని నిలదీశారు. అధికారుల ప్రవర్తనపై చంద్రబాబు మండిపడ్డారు. క్రైస్తవుడినని చెప్పుకునే జగన్​ ఎందుకు డ్లికరేషన్ తీసుకోలేదని నిలదీశారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇతర మతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్‌ ఇస్తారన్న ఆయన... అబ్దుల్‌ కలాం కూడా డిక్లరేషన్‌ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. తిరుమల వేంకటేశ్వరుని కన్నా జగన్ అతీతులుకాదని నిలదీశారు. గతంలో స్వామి వారి పింక్ డైమండ్ తన ఇంట్లో ఉందని అసత్య ప్రచారం చేసిన తితిదే ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి... ఇప్పుడు మాటమార్చి పింక్ డైమండ్ లేదంటున్నారని చంద్రబాబు విమర్శించారు. 
 
పింక్ డైమండ్ ఎక్కడుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అతిగా ప్రవర్తించవద్దు పోలీసులు, అధికారులు అతిగా ప్రవర్తించవద్దని చంద్రబాబు సూచించారు. వైకాపా ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు గమనించాలన్నారు.

గతంలో అనేకమంది అధికారులు జైలుకు వెళ్లిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. అధికారులు తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్న చంద్రబాబు... శాంతిభద్రతల కోసం గతంలో తెదేపా నేతలనే జైలుకు పంపామన్నారు. పోలీసులు, అధికారులు చట్టప్రకారమే ముందుకెళ్లాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments