Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిక్కారెడ్డిపై దాడి ఘటనపై విచారణ జరిపించండి : డీజీపీకి బాబు లేఖ

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (11:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సవాంగ్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత తిక్కారెడ్డిపై జరిగిన దాడిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని బాబు తన లేఖలో కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ఆయన ఆరోపించారు.
 
డీజీపీకి సవాంగ్‌కు ఆదివారం రాసిన లేఖలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై వైకాపా వర్గీయులు దాడి చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, రాష్ట్రంలో వైకాపా శ్రేణులు చేస్తున్న దాడులపై న్యాయ విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 
 
కాగా, కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తాజాగా జరిగిన పెద్ద బొంపల్లి జాతరలో పాల్గొన్న తిక్కారెడ్డిపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోగా, పలువురికి గాయాలయ్యాయి. ఇందులో తిక్కారెడ్డి తలకు బలమైన దెబ్బతగిలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments