Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిక్కారెడ్డిపై దాడి ఘటనపై విచారణ జరిపించండి : డీజీపీకి బాబు లేఖ

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (11:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సవాంగ్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత తిక్కారెడ్డిపై జరిగిన దాడిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని బాబు తన లేఖలో కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ఆయన ఆరోపించారు.
 
డీజీపీకి సవాంగ్‌కు ఆదివారం రాసిన లేఖలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై వైకాపా వర్గీయులు దాడి చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, రాష్ట్రంలో వైకాపా శ్రేణులు చేస్తున్న దాడులపై న్యాయ విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 
 
కాగా, కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తాజాగా జరిగిన పెద్ద బొంపల్లి జాతరలో పాల్గొన్న తిక్కారెడ్డిపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోగా, పలువురికి గాయాలయ్యాయి. ఇందులో తిక్కారెడ్డి తలకు బలమైన దెబ్బతగిలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments