Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు : చంద్రబాబు ధ్వజం

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (14:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరి అండ చూసుకుని రెచ్చిపోతున్నారంటూ ఆయన నిలదీశారు. 
 
పోలీసుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు వచ్చిన చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత కాళ్లపైనుంచి పోలీసు జీపు వెళ్లిన ఘటన రాష్ట్ర00 వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, ఎవరి అండ చూసుకుని పోలీసులు ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. 
 
ఈ ఘటనపై పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక గాడితప్పిన ప్రతి అధికారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంతో పాటు సిగ్గుగా ఉందన్నారు. చిత్తూరులో మేయర్‌ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి అక్రమ కేసులు పెట్టడంలో అర్థమేంటని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments