Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు : చంద్రబాబు ధ్వజం

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (14:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరి అండ చూసుకుని రెచ్చిపోతున్నారంటూ ఆయన నిలదీశారు. 
 
పోలీసుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు వచ్చిన చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత కాళ్లపైనుంచి పోలీసు జీపు వెళ్లిన ఘటన రాష్ట్ర00 వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, ఎవరి అండ చూసుకుని పోలీసులు ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. 
 
ఈ ఘటనపై పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక గాడితప్పిన ప్రతి అధికారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంతో పాటు సిగ్గుగా ఉందన్నారు. చిత్తూరులో మేయర్‌ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి అక్రమ కేసులు పెట్టడంలో అర్థమేంటని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments