Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ఏపీ కొత్త మంత్రివర్గ తొలి సమావేశం... దిశచట్టం సవరణపై చర్చ

ys jagan
, శుక్రవారం, 24 జూన్ 2022 (13:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్తమంత్రివర్గం తొలి సమావేశం శుక్రవారం జరుగనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. ఇటీవల ఏపీ మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కొత్త మంత్రివర్గం ఒక్కసారి కూడా సమావేశంకాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరుగనుంది. ఈ భేటీ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
 
ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో రెండు లక్షల ఎకరాలు భూములు అర్చకుల ఆక్రమణలో ఉన్నట్టు గుర్తించారు. ఈ భూములపై ప్రధానంగా చర్చ జరుగనుంది. 
 
అలాగే, దిశ చట్టం సవరణలకు సంబంధించిన అంశాన్ని కూడా మంత్రివర్గంలో మరోమారు నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఇటీవల కోనసీమ జిల్లా పేరు మార్పుపై చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు ఆ జిల్లా మార్పుపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
అలాగే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైకాపా ఎంపీలు మద్దతు ఇచ్చే విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే భేషరతు మద్దతు ప్రకటించిన వైకాపా.. ఆమె నామినేషన్ దాఖలు సమయంలోనూ వైకాపా ఎంపీలు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీగా పెరిగిన బంగారం - వెండి ధరలు