Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

సెల్వి
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (15:58 IST)
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీ డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంది. డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 50 మంది కార్పొరేటర్లలో 47 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియకు హాజరయ్యారు. 
 
తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్-అఫిషియో సభ్యులుగా పాల్గొన్నారు. ఎన్నికల్లో మునికృష్ణకు 26 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డికి 21 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు తర్వాత, అధికారులు మునికృష్ణను విజేతగా ప్రకటించారు.
 
మరోవైపు తన విజయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంకితం చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ మునికృష్ణ తెలిపారు. తన విజయానికి మద్దతునిచ్చిన కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేయడంతోనే తన గెలుపు సాధ్యమైందన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానానికి జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మండవ కృష్ణకుమారి విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments