టాస్క్ ఫోర్స్ దాడుల్లో 38 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (18:27 IST)
టాస్క్ ఫోర్స్ కు రాబడిన సమాచారం మేరకు తిరుమల అడవుల్లో ఏకకాలంలో చేపట్టిన దాడుల్లో 38 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్యకి అందిన సమాచారం తో మూడు బృందాలను, మూడు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు.

ఆర్ ఐ భాస్కర్, ఆర్ ఎస్ ఐ లు వాసు, లింగాధర్ టీమ్ శ్రీవారి మెట్టు సమీపంలో ఈతకుంట వద్ద ఎర్ర చందనం దుంగలు మోసుకుని వస్తున్న తమిళ స్మగ్లర్లు పై శుక్రవారం తెల్లవారుజామున దాడులు చేశారు.  అయితే స్మగ్లర్లు దుంగలను పడవేసి పారిపోయారు.

వీరు పడేసిన 11 దుంగలను స్వాధీనం చేసుకుని పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. అదే విధంగా కడపజిల్లా రాయచోటి వీరబల్లి మండలం లో వన్నెమాండ్ల అటవీ ప్రాంతంలో ఆర్ ఐ ఆలీ బాషా, ఆర్ ఎస్ ఐ రవికుమార్ ల బృందం 14 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని,  ఒకరిని అరెస్ట్ చేసి నట్లు తెలిపారు.

మరి కొంతమంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రైల్వే కోడూరు కెవి బావి ప్రాంతంలో ఆర్ ఐ కృపానంద, ఆర్ ఎస్ ఐ లక్ష్మయ్య 13 ఎర్ర చందనం దుంగలను, స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

ఈ రెండు దాడులు అటవీశాఖ తో జాయింట్ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.తదుపరి విచారణ జరుగుతోందని అన్నారు. ఈ కేసులను టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో సిఐ సుబ్రహ్మణ్యం కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments