Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాస్క్ ఫోర్స్ దాడుల్లో 38 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (18:27 IST)
టాస్క్ ఫోర్స్ కు రాబడిన సమాచారం మేరకు తిరుమల అడవుల్లో ఏకకాలంలో చేపట్టిన దాడుల్లో 38 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్యకి అందిన సమాచారం తో మూడు బృందాలను, మూడు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు.

ఆర్ ఐ భాస్కర్, ఆర్ ఎస్ ఐ లు వాసు, లింగాధర్ టీమ్ శ్రీవారి మెట్టు సమీపంలో ఈతకుంట వద్ద ఎర్ర చందనం దుంగలు మోసుకుని వస్తున్న తమిళ స్మగ్లర్లు పై శుక్రవారం తెల్లవారుజామున దాడులు చేశారు.  అయితే స్మగ్లర్లు దుంగలను పడవేసి పారిపోయారు.

వీరు పడేసిన 11 దుంగలను స్వాధీనం చేసుకుని పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. అదే విధంగా కడపజిల్లా రాయచోటి వీరబల్లి మండలం లో వన్నెమాండ్ల అటవీ ప్రాంతంలో ఆర్ ఐ ఆలీ బాషా, ఆర్ ఎస్ ఐ రవికుమార్ ల బృందం 14 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని,  ఒకరిని అరెస్ట్ చేసి నట్లు తెలిపారు.

మరి కొంతమంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రైల్వే కోడూరు కెవి బావి ప్రాంతంలో ఆర్ ఐ కృపానంద, ఆర్ ఎస్ ఐ లక్ష్మయ్య 13 ఎర్ర చందనం దుంగలను, స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

ఈ రెండు దాడులు అటవీశాఖ తో జాయింట్ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.తదుపరి విచారణ జరుగుతోందని అన్నారు. ఈ కేసులను టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో సిఐ సుబ్రహ్మణ్యం కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments