మారియట్ హోటల్‌లో పేకాట దందా.. తెదేపా మాజీ ఎమ్మెల్యే అరెస్టు...

హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో పేకాట దందా కొనసాగింది. ఈ నక్షత్ర హోటల్‌లో ఏకంగా 15 గదులను బుక్ చేసి పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (15:20 IST)
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో పేకాట దందా కొనసాగింది. ఈ నక్షత్ర హోటల్‌లో ఏకంగా 15 గదులను బుక్ చేసి పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 38 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.23 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, స్వైపింగ్‌ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. 
 
నిందితుల్లో పలు సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. హోటల్‌లో ఆర్గనైజర్స్ 3 రూమ్స్ బుక్ చేశారని.. సంజయ్ అనే ఆర్గనైజర్‌తో పాటు మరో ఇద్దరు కూడా వేర్వేరుగా గదులు బుక్ చేసుకున్నారు. వీరంతా మూడు ముక్కలాట ఆడుతూ పట్టుబడ్డారు. వీరి దగ్గర నుంచి 24 లక్షల నగదుతో పాటు 1800 క్యాసినో కాయిన్స్, 38 సెల్‌ఫోన్స్, మద్యం బాటల్స్ స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ డీసీపీ శశిధర్ రాజు వెల్లడించారు. 
 
మరోవైపు హైదరాబాద్‌ పంజాగుట్టలోని హరిత ప్లాజాపై శుక్రవారం తెల్లవారుజామున సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని అలియాస్ వెంకట మధుసూధనరావు పట్టుబడ్డారు. నానితో పాటు మరోనలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5.74 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments