Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' సినిమా చూశాడు... బస్సును హైజాక్ చేసిన దొంగ.. (Video)

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (09:11 IST)
హీరో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "పుష్ప-2". ఈ నెల 5వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథను స్ఫూర్తిగా తీసుకున్న ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సును హైజాక్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాధిక్ అనే వ్యక్తి ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చి 'పుష్ప-2' చూసి బస్టాండులోని బస్సులోనే నిద్రించాడు. అయితే, బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరుకు వరకు నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన ఆపి మళ్లీ నిద్రపోయాడు. 
 
అయితే, బస్సు కనిపించకపోవడాన్ని గమనించిన బస్సు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హైజాక్ చేసిన బస్సు చింతలూరు వద్ద ఉన్నట్లు సమాచారం అందుకుని, అక్కడకు చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బస్సులో గుర్రుపెట్టి నిద్రపోతున్న దొంగను కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments