Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చడానికి మీకు ఎంత సమయం కావాలి? సుప్రీం ప్రశ్న

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లను ఎంత కాలంలోగా తేల్చేస్తారో చెప్పాలని ఆదేశించింది. వచ్చే నెల 8వ తేదీలోగా కోర్టుకు

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (12:18 IST)
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లను ఎంత కాలంలోగా తేల్చేస్తారో చెప్పాలని ఆదేశించింది. వచ్చే నెల 8వ తేదీలోగా కోర్టుకు తెలపాలని సూచించింది. పార్టీ మారిన నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌, ఎమ్మెల్యే సంపతకుమార్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ చేశారు. 
 
జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ రోహింగ్టన్‌ నారిమన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ముందుగా పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదిస్తూ అధికార పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని 2014 ఆగస్టు నెలలో స్పీకర్‌కు పిటిషన్‌ ఇచ్చామని, రెండున్నరేళ్లు గడిచినా స్పీకర్‌ వాటిని పరిష్కరించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
 
2015లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోలేదన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన దస్తీ నోటీసులను పిటిషనర్‌ స్వయంగా ప్రతివాదులకు అందించారని గుర్తుచేశారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. స్పీకర్ వద్ద పెండింగ్‌లో అనర్హత పిటిషన్లను పరిష్కరించడానికి ఎంత కాలం కావాలో వచ్చే నెల 8వ తేదీలోగా కోర్టుకు చెప్పాలని తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం నవంబరు 8వ తేదీకి విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం